బీజేపీ-టీడీపీ, జనసేన పార్టీల పొత్తు ఓకే అయింది. ఈ మేరకు చంద్రబాబు, అచ్చన్నాయుడు.., జనసేన నేత నాదెండ్ల మనోహర్… .కేంద్ర మంత్రి షెకావత్ బృందం ఉండవల్లిలో చంద్రబాబు నివాసంలో రెండున్నర గంటలపాటు సాగిన చర్చలలో స్పష్టత వచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల రణరంగంలో పోరుకు బీజేపీ-జనసేన-టీడీపీ ఏకతాటిపైకి వచ్చినట్లయింది.
.బీజేపీ అగ్రనేత అమిత్ షా, అధ్యక్షుడు నడ్డా , ఆర్ఎస్ఎస్ కీలక నేతలతో ఇంతకుముందు ఢిల్లీలో జరిపిన చర్చలలోనే దాదాపు ఓ కొలిక్కి వచ్చాయి. దీంతో ఎన్డీయేలో తెలుగు దేశం, జనసేన చేరిక ఖాయమైంది. . పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించాల్సిన స్థానాల పై ఢిల్లీలో సుదీర్ఘ చర్చలు జరిగాయి.
బీజేపీ అడుగుతున్నన్ని సీట్లు కాకుండా 4 లోక్సభ, 8 అసెంబ్లీ సీట్లలో పోటీ చేస్తే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చంద్రబాబు, పవన్ పేర్కొన్నట్లు సమాచారం.
బీజేపీ పార్లమెంట్ స్థానాలు: ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ … రాజంపేట, హిందూపురం, తిరుపతి, ఏలూరు, విశాఖపట్నం ఎంపీ సీట్లను కేటాయించాలని సూచించినట్లు తెలిసింది. అలాగే అసెంబ్లీ సీట్ల విషయంలో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలలో ఒక్కో సీటు, రాయలసీమలో నాలుగు, ఉత్తరాంధ్రలో రెండు స్థానాలు కావాలని బీజేపీ నేతలు చెప్పినట్లు తెలుస్తోంది.
పరిపూర్ణానంద హిందూపురం.. శ్రీ పీఠం స్వామి పరిపూర్ణానంద హిందూపురం పార్లమెంట్ సీటు ఖాయమయినట్లు చెపుతున్నారు. తిరుపతి ఐఏఎస్ అధికారిని రత్నప్రభ, ఏలూరు గారపాటి సీతారామాంజనేయ చౌదరి, రాజమండ్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఎంపికైనట్లు సమాచారం.