జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొన్ని అంశాలపై స్పందించారు. కోనసీమ అల్లర్లతో పాటు మరికొన్ని విషయాలపై ఆయన మీడియా మాట్లాడారు. వైయస్సార్ సీపీపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీ మళ్లీ గెలిస్తే వచ్చే పరిణామాలను వివరించి చెప్పారు. అలాగే బీజేపీతో జనసేన కూటమి గురించి వెల్లడించారు. హింసను ప్రేరేపించే ఏ ప్రభుత్వాన్నీ ప్రజలు ఇష్టపడరు. ఓట్లు వేయరు. ఉభయగోదావరి జిల్లాల్లో వైయస్సార్ సీపీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుందని జనసేనాని పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘కోనసీమ అల్లర్లు కావాలనే చేశారని నాకు అనిపిస్తోంది. కేంద్ర నిఘావర్గాలు ముందే హెచ్చరించినా పోలీసులు పట్టించుకోపోవడం, ముఖ్యమంత్రి ఇంతవరకు దీనిపై స్పందించకపోవడం, డీజీపీ కూడా పట్టించుకోకపోవడం.. మంత్రులు ఎవరూ అక్కడికి వెళ్లకపోవడం చూస్తోంటే అదే అనిపిస్తోంది’’ అని పవన్ ఆరోపించారు. డీజీపీ బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదంటూ మండిపడ్డారు.
ఒక సమస్యను మళ్లించడానికి మరో సమస్యను తెచ్చిపెట్టే ప్రయత్నం చేస్తున్నరు.. కోనసీమ తగలబడుతుంటే యాత్రలా అంటూ నిలదీశారు. ఎమ్మెల్సీ అనంత్బాబు విషయాన్ని పక్కకు మళ్లించడానికి కోనసీమ అల్లర్లు తెచ్చారన్నారు. కోనసీమలో అంబేడ్కర్పై గౌరవం లేక కాదు. అది వారి పార్టీలోనే రెండు గ్రూపుల మధ్య వివాదం అని… బహుజన సిద్ధాంతానికి వ్యతిరేకంగా పన్నిన పన్నాగంలా అర్థమవుతోందంటూ చెప్పుకొచ్చారు పవన్. ఒకవైపు కోనసీమ తగలబడుతోంటే బస్సు యాత్రలు చేస్తారా? ఈ ఘటనలు మొత్తం ఆంధ్రప్రదేశ్కు మైనస్. దీన్ని ఎవరైనా తమకు అనుకూలంగా, ప్లస్గా తీసుకుంటే వారు సమాజహితం కోరుకునే వారు కాదు. ఒకవేళ జనసేన వారే అందులో ఉంటే అరెస్టు చేయాలన్నారు.
‘‘వైసీపీ.. కాపులు, బీసీలు, మత్స్యకారులు, కమ్మ సామాజిక వర్గాలను శత్రువులుగా ప్రకటించింది. చివరికి వారికి ఇతరులెవరూ మిగలరు’’ అని హితబోధచేశారు. కోనసీమ అల్లర్లలో మోదీ ప్రమేయం ఉందని అలగే శివసేన అధికార ప్రతినిధి అనడం సరికాదు.. అందులో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. మోదీకి ఏ సంబంధం లేదు.. వైపీపీ తప్పులు చేసి కేంద్ర ప్రభుత్వానికి అంటగట్టాలని చూస్తోందని ఆరోపించారు. బీజేపీ, జనసేన ఉమ్మడి సీఎం అభ్యర్థిని తానేనంటూ.. జరుగుతున్నది కేవలం ప్రచారమే అని కొట్టిపడేశారు. ‘నేను గాల్లో మేడలు కట్టను’ అన్నారు.