కీలకమైన ఎన్నికల వేళ తెలంగాణాలో అధికార బీఆర్ఎస్ పార్టీకి (BRS Party) షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు నేతలు బీఆర్ఎస్ను వీడగా.. తాజాగా మరో ముఖ్యనేత గులాబీ పార్టీకి గుడ్బై చెప్పేశారు. అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం (Alampur MLA Abraham) బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. అబ్రహం కాంగ్రెస్ పార్టీలో (Congress) చేరనున్నారు. ఏఐసీసీ కార్యదర్శి, కాంగ్రెస్ అభ్యర్థి సంపత్ కుమార్ (Congress Candidate Sampath Kumar) ఆధ్వర్యంలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy) సమక్షంలో అబ్రహం కాంగ్రెస్లో చేరనున్నారు. జూబ్లీహిల్స్ లోని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి నివాసంలో అబ్రహం హస్తం పార్టీ కండువా కప్పుకోనున్నారు. అయితే ఇప్పటికే అలంపూర్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్కు చెందిన నలుగురు జెడ్పీటీసీలు, ముగ్గురు ఎంపీపీలు, పలువురు ఎంపీటీసీలు, సర్పంచులు కాంగ్రెస్లో చేరిన విషయం తెలిసిందే. ఇదే పరిస్థితి కొనసాగితే బీఆర్ఎస్ కి ఎదురుదెబ్బ ఖాయంగా కనిపిస్తోంది.