ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే.. మరి కాసేపట్లో ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లతో సమావేశం కానున్నారు. హోం మంత్రి అమిత్ షాను కూడా కలిసే అవకాశం ఉందని సమాచారం.
టీడీపీ అధినేత చంద్రబాబు అమిత్ షాను కలిసిన వెంటనే జగన్ కూడా వెళ్లడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అభివృద్ధి అంశాలపై ప్రధానితో జగన్ చర్చించే అవకాశం ఉందని చెపుతున్నారు. ప్రధాని మోదీతో భేటీ అనంతరం మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.