వివేకా హత్య కేసులో ఈ నెల 25 వరకు అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేయొద్దంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. దీనిపై నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు స్పందించారు.
”వివేకా కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో భరోసా లభించింది.. ఇది న్యాయ వ్యవస్థపై అత్యంత గౌరవం పెంచే సందర్భం .. సోమవారం వరకు అరెస్ట్ చేయొద్దని అవినాశ్ న్యాయవాది ప్రాధేయపడ్డారు ..” అన్నారు రఘురామా.
కాగా, వివేకా హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డిని సీబీఐ ఇవాళ కూడా విచారించింది. అయితే రేపు రంజాన్ కావడంతో అవినాశ్ ను విచారించడంపై సందిగ్ధత నెలకొంది. సోమవారం వరకు అరెస్టు చేయవద్దని సుప్రీం ఇచ్చిన ఆర్డర్ ప్రకారం.. మంగళవారం అవినాష్ ని అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది.