తుపాకీ కాల్పులు, బాంబు పేలుళ్లతో సూడాన్ రాజధాని ఖార్తోమ్ దద్దరిల్లుతున్నది. సూడాన్ ఆర్మీ, పారామిలటరీ బలగాలకు మధ్య పెద్దఎత్తున తుపాకీ కాల్పులు, బాంబు దాడులు కొనసాగుతున్నాయి. రాజకీయ అధికారం కోసం ఇరు వర్గాల మధ్య జరుగుతున్న ఘర్షణల్లో ఇప్పటిదాకా 270 మందికిపైగా అమాయక పౌరులు చనిపోయారని సమాచారం. పౌరుల మృతదేహాలు వీధుల్లో, రోడ్లపై కనపడుతున్నాయి. ఘర్షణ కారణంగా అక్కడి భారతీయులెవరు అక్కడ భారత ఎంబసీకి వెళ్లద్దని భారత ప్రభుత్వం సూచించింది.