‘అంతరాష్ట్ర నదీ వివాదాలపై రాష్ట్రాలు క్లారిటీగా ఉండాలి….’ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఏపీ సీఎం జగన్ మోహన్రెడ్డికి లేఖను రాశారు. ఆంధ్రప్రదేశ్-తమిళనాడు సరిహద్దు చిత్తూరు పరిధిలో తలపెట్టిన రెండు ప్రాజెక్టులను ఆపాలని కోరారు. ఆనకట్టలు నిర్మించడం వల్ల చెన్నైకి నీటి కొరత ఏర్పడే అవకాశముందని పేర్కొన్నారు. తమిళనాడు ప్రభుత్వంతో చర్చించకుండా ఆనకట్టల నిర్మాణం చేపట్టవద్దని లేఖలో కోరారు. కొనస్తల నదిపై ఆనకట్టల నిర్మాణాన్ని ఖండిస్తున్నామని స్టాలిన్ తెలిపారు. ఆనకట్టల నిర్మాణం ఆపాలని ఏపీ ప్రభుత్వం ఆదేశాలివ్వాలని , నది పరివాహాక ప్రాంతంలోనూ ఆనకట్టల నిర్మాణం చేపట్టవద్దని విజ్ఞప్తి చేశారు.