పోలీసులంటే ప్రజలకు రక్షణ కల్పించాలి. అందులోను మహిళలంటే మరీ గౌరవవించాలి. కాని హైదరాబాద్ మియాపూర్ సీఐ అందుకు భిన్నంగా వ్యవహరించాడు. ఒక కేసు విషయమై తనను ఆశ్రయించిన ఓ మహిళపై అసభ్యంగా ప్రవర్తించాడు.
మియాపూర్ స్టేషన్లో సీఐగా విధులు నిర్వహిస్తున్న ఎం.ప్రేమ్ కుమార్ వద్దకు భార్యాభర్తల వివాదం విషయమై ఫిర్యాదు చేసేందుకు ఆశ్రయించింది. దానిని అవకాశంగా తీసుకొని ఆయన ఆమెతో ఫోన్లో చాటింగ్ మొదలుపెట్టాడు. అంతేకాదు దురుసుగా ప్రవర్తించాడు. ఆ మహిళ నేరుగా కమిషనర్ కు ఫిర్యాదు చేసింది. కమిషనర్ విచారించగా నిజమని తేలింది. దీంతో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాశ్ మహంతి ప్రేమ్ కుమార్ ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలిచ్చారు.