- ధిల్లీలో ప్రారంభించిన మంత్రి పీయూష్ గోయల్
- కిలో రూజ29కే
రాయితీ ధరతో కేంద్రం సరఫరా చేస్తున్న భారత్ రైస్ అమల్లోకి వచ్చింది. మంగళవారం ధిల్లీలో కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ సందర్భంగా మాట్లాడారు. కిలో బియ్యం ధర కేవలం రూ.29కే అందజేస్తున్నట్టు చెప్పారు. ధరల స్థిరీకరణ ద్వారా నేరుగా వినియోగదారులకు లబ్ధి కలిగిస్తున్నట్టు తెలిపారు. అయితే 5, 10 కిలోల సంచుల్లో లభించే ఈ బియ్యంలో 5 శాతం నూక ఉంటుంది. ఈ రైస్ విక్రయాలకు 100 సంచార వాహనాలు కూడా మంత్రి ప్రారంభించారు. ఈ రైస్ తొలి దశలో భారత జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్ సమాఖ్య, జాతీయ సహకార వినియోగదారుల సమాఖ్య, కేంద్రీయ భండార్ విక్రయ కేంద్రాల్లో విక్రయిస్తారు. ఈ కామర్స్ ద్వారా కొనుగోలు చేసేవీలుంది.