వ్యవసాయ రంగానికి పెద్దపీట
బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయం
ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమగ్రరూపం దాల్చుకొంది. బుధవారం మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్రంలో పాలన సాగుతోందని, ముఖ్యమంత్రి జగన్ చాణక్యుడి తరహాలో పాలన అందిస్తున్నారని ప్రశంసించారు. అంబేద్కర్ ఆశయాలే తమ ప్రభుత్వానికి ఆదర్శమని, రాష్ట్రంలోని ఏ బలహీన వర్గాన్నీ విస్మరించకూడదన్న వైఎస్ రాజశేఖర రెడ్డి స్ఫూర్తితో ఈ బడ్జెట్ ను రూపొందించినట్టు తెలిపారు. వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యమిచ్చామన్నారు.
ఇదీ బడ్జెట్..
వార్షిక బడ్జెట్ రూ.2,86,389.27 కోట్లు
రెవెన్యూ వ్యయం రూ.2,30,110.41 కోట్లు
మూలధన వ్యయం రూ.30,530.18 కోట్లు
రెవెన్యూ లోటు రూ.24,758.22 కోట్లు
ద్రవ్య లోటు రూ.55,817.50 కోట్లు
జీఎస్డీపీలో ద్రవ్యలోటు 3.51 శాతం
రెవెన్యూ లోటు 1.56 శాతం