”నా స్నేహితుడు రాజశేఖర్ రెడ్డి కుమారుడైన జగన్ పై నాకు వ్యక్తిగతమైన కక్ష్య లేదు. కాకపొతే ఆంధ్రప్రదేశ్ నాశనం అవుతుందన్న బాధతోనే నేను కోర్టులో పిల్ వేయడానికి సిద్ధపడ్డాను…” అని వైసీపీ రెబర్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు.
‘11చార్జిషీట్లలో నిందితుడైన జగన్ సీఎం పదవికి అర్హుడైనపుడు కోర్టులో పిల్ వేసేందుకు నేను కూడా పూర్తిగా అర్హుడినే’ అని చెప్పుకొచ్చారు.. రఘురామా.. ‘న్యాయస్థానంలో పిల్ వేసేందుకు రఘురామరాజు అనర్హుడు’ అంటూ ఏజీ శ్రీరామ్ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. ‘‘శ్రీరామ్ వ్యాఖ్యలు హాస్యాస్పదం. రూ.43వేల కోట్లు కొట్టేసిన ఆర్థిక నేరాభియోగాలతో సీబీఐ 11 కేసులు నమోదు చేసింది. ఆ కేసుల్లో కోర్టుకు హాజరుకాకుండా తప్పించుకుని తిరుగుతూ జగన్ సీఎం కాగలిగినపుడు… నేను పిల్ వేయడంలో తప్పేముంది? వైసీపీ ఎంపీనంటూ తప్పుడు ధ్రువీకరణ ఇచ్చానని చెప్పడం ఆశ్చర్యకరం. నన్ను ఇంకా పార్టీ నుంచి బహిష్కరించలేదు. ఆ విషయం ఆయన తెలుసుకోవాలి. నన్ను బహిష్కరించాలని జగన్కు సలహా ఇవ్వాలి. ఆ పనిచేస్తే సాధారణ ఎంపీగా ధ్రువీకరణ పత్రం సమర్పిస్తా. లాక్పలో చిత్రహింసలకు గురిచేసినా నా మిత్రుడి కుమారుడైన జగన్పై వ్యక్తిగత ద్వేషం లేదు’ అని రఘురామ పునరుద్ఘాటించారు.