ఉదయం 10 గంటలకు ప్రారంభమైన శాసనసభలో మేడిగడ్డ బ్యారేజ్ పై ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చింది. సాగునీటి ప్రాజెక్టులపై శ్వేత పత్రం విడుదల చేసింది. ప్రాజెక్టు కుంగడానికి గల కారణాలను నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు. ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలను మేడిగడ్డకు తీసుకెళ్లింది ప్రభుత్వం. టీఆర్ఎస్, బీజేపీ ఆ పర్యటనకు దూరంగా ఉన్నాయి. ప్రాజెక్టుపై ప్రభుత్వం ఏ ఎంక్వయిరీ అయినా వేసుకోమని తెలిపినట్టు బీఆర్ఎస్ చెబుతోంది. దీనిపై అసెంబ్లీలో రచ్చ జరుగుతోంది.