విశాఖ నార్త్ నియోజకవర్గంలో నారా లోకేశ్ నిర్వహించిన శంఖారావం సభలో టీడీపీ ఇన్ చార్జి గంటా శ్రీనివాసరావు ప్రసంగించారు. నాడు అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించినపుడు అందరూ అవహేళన చేశారని, కానీ ఆ తర్వాత ఆయన ప్రపంచానికి తమ సత్తా ఏంటో చాటారన్నారు. భారతదేశంలో ఏ పార్టీకీ లేని కార్యకర్తల సంక్షేమనిధిని లోకేశ్ టీడీపీ కేడర్ కోసం ప్రవేశపెట్టారని ప్రశంసించారు. లోకేశ్ పార్టీని కొత్తపుంతలు తొక్కిస్తున్నారని, రాబోయే రోజుల్లో సమర్థవంతంగా పార్టీని నడిపించే నాయకుడు మాకు ఉన్నాడని నిరూపించారని కొనియాడారు.
త్వరలో జగన్ కు బై బై చెప్పాల్సిన చారిత్రాత్మక అవసరం రాష్ట్రానికి వచ్చింది. ప్రజావేదిక కూల్చివేతతో జగన్ పాలన ప్రారంభించారు. ప్రభుత్వ భవనాన్ని ప్రభుత్వమే కూల్చివేయడం దేశ చరిత్రలో ఇదే ప్రథమం. 900కి పైగా హామీలు ఇచ్చి, 15శాతం కూడా నెరవేర్చలేదు, మద్య నిషేధం చేశాకే ఓట్లు అడుగుతామని చెప్పిన జగన్ ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారని లోకేశ్ ఘాటుగా విమర్శించారు.