చంచల్ గూడ జైలును వేరే చోటుకు తరలిస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆ జైలును ఇకపై విద్యా సంస్థగా మారుస్తాం.. అక్కడ కాలేజీ, స్కూలును నిర్మిస్తామని ఆయన తెలిపారు. రాజకీయాలు, అభివృద్ధిని వేరుగా చూడాలని చెప్పారు. అభివృద్ధి కోసమే మున్సిపల్ శాఖను తన వద్ద ఉంచుకున్నానని, హైదరాబాద్ లో ప్రతి గల్లీని అభివృద్ధి చేస్తామని అన్నారు.
2028 నాటికి పాతబస్తీ మెట్రో రైల్ ప్రాజెక్టును పూర్తి చేస్తామని..హైదరాబాద్ లో 55 కిలోమీటర్ల మేర ప్రవహిస్తున్న మూసీ పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు. పాతబస్తీలో మోట్రో రైల్ శంకుస్థాపన కార్యక్రమంలో రేవంత్ ఈ మేరకు వ్యాఖ్యానించారు. మరోవైపు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ రేవంత్ పై ప్రశంసలు కురిపించారు. ఎంతో కష్టపడి రేవంత్ సీఎం స్థానానికి ఎదిగారని చెప్పారు.