బెంగళూరులో నీటి ఎద్దడి తీవ్రంగా వేధిస్తోంది. గేటెడ్ కమ్యూనిటీల్లో నివసించే జనం సైతం తాగేందుకు నీరు లేక అవసరాల కోసం వాష్రూమ్లను ఉపయోగించడానికి సమీపంలోని మాల్స్కు పరుగులు పెడుతున్నారు. స్నానాల కోసమైతే జిమ్లకు వెళ్తున్నారట. సోషల్ మీడియా వెబ్సైట్ ద్వారా తాము ఎదుర్కొంటున్న నీటి సమస్యను బెంగళూరు వాసులు గోడు వెళ్ళబోసుకుంటున్నారు. ప్రెస్టీజ్ ఫాల్కన్ సిటీలోని ఒక ఫ్లాట్లో నివాసం ఉంటున్నట్లు పేర్కొన్న ఒక వ్యక్తి తమకు చుక్క నీరు రావడం లేదని వాపోయాడు.
బెంగళూరు నీటి సమస్య తీవ్రరూపం దాల్చడంతో చాలా మంది అద్దెదారులు తమ ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు. నీరులేక టాయిలెట్ల దుర్వాసనను భరించలేక ఇళ్ళను ఖాళీ చేస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రతిరోజు తమ కాలకృత్యాలు తీర్చుకోవడానికి సమీపంలోని ఫోరమ్ మాల్కు వెళ్లడం సర్వసాధారణమైపోయిందంటున్నారు. కొంతమంది ఏకంగా జిమ్లకు ఒక జత బట్టలు, టవల్తో స్నానం చేసి తిరిగి వస్తున్నారు. ట్యాంకర్ వాటర్పై ఆధారపడే నగరంలో ఎట్టి పరిస్థితుల్లో ఫ్లాట్లను కొనవద్దని నీటి సమస్య ఎదుర్కొంటున్న బాధితులు కోరుతున్నారు.