ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఈడీ కస్టడీ కొనసాగుతుండగానే ఎమ్మెల్సీ కవిత తన అరెస్ట్పై ఇవాళ సుప్రీంకోర్ట్లో పిటిషన్ దాఖలు చేశారు. కవిత రిట్ పిటిషన్ పై అత్యున్నత న్యాయస్థానం తీసుకునే నిర్ణయం ఎలా ఉండనుందనేది ఆసక్తికరంగా మారింది. లిక్కర్ కేసులో తనను అక్రమంగా అరెస్ట్ చేశారని.. ఈ కేసులో తన ప్రమేయం ఉన్నట్లు ఆధారాలు లేవoటూ కవిత పిటిషన్ లో పేర్కొన్నారు. ప్రతివాదిగా ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ చేర్చారు. ఇదిలాఉంటే.. మరోవైపు కవిత భర్త అనిల్ను విచారించేందుకు సిద్ధమైంది ఈడీ. ప్రధానంగా మనీలాండరింగ్పై ప్రశ్నాస్త్రాలు సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది.
ఈడీ విచారణ అనంతరం కవితతో భర్త అనిల్, కేటీఆర్, హరీష్రావుతో పాటు న్యాయవాది ములాఖత్ అయ్యారు. ఈ క్రమంలో తన అరెస్ట్ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించాలని కీలక నిర్ణయం తీసుకున్నారు కవిత. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్లో ఉండగా.. ఈడీ తనను అరెస్ట్ చేయడాన్ని ఛాలెంజ్ చేస్తూ కంటెప్ట్ అఫిడవిట్ దాఖలు చేయనున్నారు. కవిత తరఫున ప్రముఖ సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గీ, కపిల్ సిబల్ సుప్రీంకోర్టులో వాదనలు వినిపించనున్నారు.