తెలంగాణ ప్రభుత్వం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. 11వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి గురువారం ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నివాసంలో నోటిఫికేషన్ విడుదల చేశారు. ఏకంగా 11,062 పోస్టులతో జారీ అయిన ఈ నోటిఫికేషన్ లో 2,629 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, 6,508 ఎస్జీటీ పోస్టులు ఖాళీలు ఉన్నాయి. 727భాషా పండితులు, పీఈటీలు 182 పోస్టులను భర్తీ చేయనున్నారు. ప్రత్యేక కేటగిరీలో స్కూల్ అసిస్టెంట్లు 220, ఎస్జీటీలు 796 ఉద్యోగాలు ఉన్నాయి.
గతం ప్రభుత్వం జారీ చేసిన డీఎస్సీ నోటిఫికేషన్ ను రేవంత్ రెడ్డి సర్కారు రద్దు చేసింది. గతేడాది సెప్టెంబర్ 6న 5,089 పోస్టులతో బీఆర్ఎస్ ప్రభుత్వం నియామక ప్రకటన విడుదల చేసింది. అప్పట్లో దరఖాస్తు చేసుకున్నవారు మళ్లీ దరఖాస్తు చేసుకోనవసరం లేదని సీఎం స్పష్టతనిచ్చారు.