వైసీపీకి షాక్ తగిలింది. రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. 2న టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు నెల్లూరు, గురజాలలో పర్యటించనున్నారు. ఆ రోజు ఉదయం నెల్లూరులో చంద్రబాబు సమక్షంలో వేమిరెడ్డి టీడీపీ జెండా వేసుకోనున్నారు.
‘రా కదలి రా’ కార్యక్రమంలో అదే రోజు మధ్యాహ్నం 2గంటలకు గురజాలలో, 4న రాప్తాడులో నిర్వహించే సభలో బాబు పాల్గొంటారు. వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కష్టపడుతున్న చంద్రబాబు 22 ‘రా కదలి రా’ సభల్లో పాల్గొన్నారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలోనూ ఈ సభలు నిర్వహిస్తున్నారు.