హిమాచల్ ప్రదేశ్ కు చెందిన ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై ఆ పార్టీ వేటు వేసింది. వారంతా రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా ఓటువేశారు. ఫిరాయింపుల నిరోధక చట్టం కింద వారిపై వేటు వేసినట్టు శాసనసభాపతి తెలిపారు. కాంగ్రెస్ గుర్తుపై గెలిచిన వారిపై అనర్హత వేటు వేశామని, ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుందని చెప్పారు.
క్రాస్ ఓటింగ్ జరిగిన తర్వాత సంక్షోభంలో కూరుకుయిన కాంగ్రెస్ సర్కారు ప్రస్తుతానికి గండం నుంచి గట్టెక్కింది. సుఖ్వీందర్సింగ్ సుఖు సారథ్యంలోని కాంగ్రెస్ సర్కారు నిన్న బడ్జెట్ను విజయవంతంగా ఆమోదించింది. తాను రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన మంత్రి విక్రమాదిత్యసింగ్ మరోమారు స్పందించారు. కాంగ్రెస్ నేతలతో చర్చలు ముగిసే వరకు రాజీనామా చేయబోనని ప్రకటించడంతో కాంగ్రెస్ ఊపిరి పీల్చుకుంది. రాజీనామా ఊహాగానాలను ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ ఖండించారు.