అమెరికాలో తెలుగు విద్యార్థిని జాహ్నవి కందులకు న్యాయం చేయాలంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. తన వాహనంతో గుద్ధి చంపిన కేసులో అమెరికన్ పోలీస్ పై సరైన ఆధారాలు లేవంటూ అమెరికా కోర్టు విడుదల చేయడంపై ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు.
అమెరికా రాయబార కార్యాలయం వెంటనే జోక్యం చేసుకొని ప్రభుత్వ వర్గాలతో మాట్లాడి జాహ్నవి కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఉన్నత విద్యకోసం ఎంతో మంది తెలుగు విద్యార్థులు విదేశీ బాట పడుతున్నారు. తమ కలలను నెరవేర్చుకునేందుకు యూఎస్, రష్యా, కెనడా లాంటి దేశాలకు వెళ్తున్నారు. విద్యార్థులకు రక్షణ లేకుండా పోయిందని తల్లి దండ్రులు మండిపడుతున్నారు.