ఈ వార్త ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణా రైతాంగానికే కాదు.. ప్రజలకు నష్టం కలిగించే అంశమే. ఐదేళ్ల వ్యవధిలో తెలంగాణలో మొత్తం 39,652 లక్షల హెక్టార్ల భూమి సారం కోల్పోయింది. ఆంధ్ర ప్రదేశ్ లో 79,283 హెక్టార్ల భూమి సారం కోల్పోయి.. సత్తువగా మారింది.
2011-13తో పోలిస్తే 2018-19లో అధిక భూమి క్షీణతకు గురైన రాష్ట్రాల జాబితాలో తెలంగాణ 17, ఆంధ్రప్రదేశ్ 6వ స్థానంలో నిలిచాయి. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఆధ్వర్యంలోని స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ తాజాగా విడుదల చేసిన ‘డెసెర్టిఫికేషన్ అండ్ ల్యాండ్ డీగ్రెడేషన్ అట్లాస్’లో ఈ వివరాలు వెల్లడయ్యాయి.
దేశవ్యాప్తంగా 2011-13 నుంచి 2018-19 మధ్యకాలంలో కొత్తగా 14.5 లక్షల హెక్టార్ల భూమి సారం కోల్పోయింది. ఆంధ్రప్రదేశ్లో 79,283 హెక్టార్ల భూమి నిస్సారంగా మారింది, తెలంగాణ రాష్ట్రంలో ఇదే సమయంలో 39,652 హెక్టార్లు, అత్యధికంగా మహారాష్ట్రలో 4,80,094 హెక్టార్ల భూమి (ఎడారీకరణ)క్షీణతకు గురై ఈ జాబితాలో తొలి స్థానంలో ఉంది. 2011-13తో పోలిస్తే 2018-19లో అధిక భూమి క్షీణతకు గురైన రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ 6, తెలంగాణ 17వ స్థానంలో నిలిచాయి. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఆధ్వర్యంలోని స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ తాజాగా విడుదల చేసిన ‘డెసెర్టిఫికేషన్ అండ్ ల్యాండ్ డీగ్రెడేషన్ అట్లాస్’లో ఈ వివరాలు వెల్లడయ్యాయి. రాష్ట్రంలో భూక్షీణతకు నీటికోత, అటవీసంపద తగ్గిపోవడం ప్రధాన కారణాలుగా ఉన్నాయి. ఇదే సమయంలో పొలాలకు వేసే ;పశువుల ఎరువులతో పాటు.. ప్లాస్టిక్ వంటి అనేక హానికారకాలు భూమిని పాడుచేసి భూసారాన్ని క్షీణింప చేస్తున్నాయ్. ఈ సమస్య పరిష్కరానికి ప్రకృతి వ్యవసాయం కొంత ఉపశమనాన్ని కలిగిస్తుంది.