మనలో రోగనిరోధక శక్తి చాలా వ్యాధులకు చెక్ పెడుతుంది. దగ్గరకు రాకుండా తరిమికొడుతుంది. అసలే వైరస్ లు విజృంభించే కాలంలో ఉన్నాం. ఇప్పుడు శరీరంలో ఇమ్యూనిటీ ఎంతో ముఖ్యం. మన శరీరంలో ఇమ్యూనిటీ పెంచే శక్తి వంతమైన ఆహారం ఖర్జూరం. ఖర్జూర పండ్లలో విటమిన్ ఎ, బీ లు పుష్కలంగా ఉంటాయి. ఈ రెండూ ఇందులో ఉండడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే ఖర్జూర పండు ఎండినా రుచే. ఈ పండులో ఔషధగుణాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. రక్తహీనతతో బాధపడుతున్నవారు, నీరసంగా ఉండేవారికి ఇది ఒక అమృతం. ఖర్జూర పండ్లు, పాలు, మీగడ లేదా కొద్దిగా నెయ్యి కలిపి ఉదయాన్నే అల్పాహారంగా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అలాగే దీనిలో సెలీనియం, మెగ్నీషియం, కాపర్, మెగ్నీషియం అధికంగా ఉండడం వల్ల ఎముకల పటుత్వానికి దోహదపడుతుంది. ఇందులో ఉండే గ్లోకోజ్, ఫ్రక్టోజ్ వంటి నేచురల్ షుగర్స్ శరీరాలనికి నీరసం రానివ్వవు. ఓస్టిరియో ఫోసిస్ కండీషన్ ను నివారించడానికి ఇవి సహాయపడతాయి. ఫోరిన్, ఐరన్ దంతాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. రక్తహీనతతో బాధపడే గర్భిణులు, మహిళలు ఖర్జూరం తరచూ తీసుకోవాలి. జీర్ణకోశ సమస్యలు ఉన్న వారు పాలల్లో 4 నుంచి 5ఎండు ఖర్జూర పండ్లు వేసి మరగబెట్టి తాగితే త్వరగా నిద్రపడుతుంది.