ఆరోగ్యశాఖ బ్రాండ్ అంబాసిడర్గా పూనమ్ పాండే వ్యవహరించడంపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. సర్వైకల్ క్యాన్సర్పై అవగాహన కార్యక్రమాలకు ప్రచారకర్తగా పూనమ్ పాండే పేరును కేంద్రం పరిశీలిస్తోందన్న వార్తలు ఇటీవల వైరల్ అయ్యాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంతో పూనమ్ పాండే, ఆమె టీం చర్చలు జరిపింది. తాను సర్వైకల్ క్యాన్సర్తో మరణించినట్టు ఇటీవల పుకార్లు సృష్టించింది. అది దేశవ్యాప్తంగా కలకలం రేపింది. అయితే ఆ మరుసటి రోజే ప్రత్యక్షమై తాను బతికే ఉన్నానని చెప్పుకొచ్చింది.ఈ వ్యాధిపై ప్రజల్లో అవగాహన పెంచేందుకే ఈ ప్రాంక్ ప్లే చేసినట్టు చెప్పింది. అందుకు బాధపడిన వారిని క్షమాపణలు కూడా కోరింది. ఈ క్యాన్సర్పై అవగాహన పెంపొందించడమే తన లక్ష్యమని పేర్కొంది.