కండకావరంతో గుడ్డలిప్పుకుని వీడియో కాల్ లో పైశాసికానికి ఒడిగట్టిన వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారాన్ని సభ్య సమాజం ఛీకొడుతున్నా.. ఆ పార్టీ ప్రముఖులు మాత్రం జనం ఏమనుకుంటారో అన్న కనీస ఇంగితం లేకుండా ఎదురుదాడికి పాల్పడుతున్నారు. ‘ఇది కమ్మ నాయాళ్ళు చేసిన పని’ అని సిగ్గు శరం వదిలేసి గొంతు చించుకుంటున్నారంటే ఏమనుకోవాలి? ‘దీనికి కమ్మోళ్లకి సంబంధం ఏముందిరా ..’ అని ఒక్కరన్నా అడగకపోగా, వెనకేసుకురావడం గమనార్హం.
వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికార పీఠం అలంకరించనప్పటి నుంచీ కమ్మ సామాజిక వర్గాన్ని కించపరిచేందుకు కంకణం కట్టుకున్నారు. ప్రత్యేకంగా ఒక కులాన్ని పదేపదే టార్గట్ చేసుకోవడం సీఎం స్థాయిలో ఏమాత్రం పద్దతి కాదు. విలువలు, నైతికత గురించి ప్రస్తావించుకోవడం ప్రస్తుత రాజకీయాల్లో సరికాదేమో. అయితే మరీ ఇంతిలా బరితెగించడం గతంలో ఎన్నడూలేడు.
న్యూడ్ గా వీడియో కాల్ మాట్లాడిన ఎంపీపై చర్యలు తీసుకోవడం, వెనకేసుకురావడం ఆ పార్టీ ఇష్టం. అయితే జనం ఏమనుకుంటారోనన్న కనీస ఇంగితం కూడా వదిలేసుకున్న ఈ పాలకుల దాస్థీకానికి కాలమే పరిష్కారం చూపుతుంది. ప్రకృతి కూడా దేన్నైనా ఓ పరిధి మించితే ఉపేక్షించదు. అంత వరకు చాలా సహనంతో ఉండాల్సిందే.