” కేంద్రంలో బీజేపీ ఈ దఫా ప్రజా వ్యతిరేఖత ఎదుర్కోక తప్పదు.. అని ఏడాది క్రితం విశ్లేషణలు చేసిన ఉద్దండులు ఇపుడు తమ అంచనాలను సవరించుకుంటున్నారు. అయోధ్య రామాలయ ప్రతిష్ట తో ప్రధాని మోదీ ప్రతిష్ట కూడా జిగేలు మంటోంది. అయోధ్య దెబ్బకు రాహుల్ గాంధీ సైతం.. 2024 ఎన్నికల బరిలో నుంచి నిష్క్రమించక తప్పని పరిస్థితి ఎదురవుతోంది.. 2029 నాటికి మోదీ 80 ఏళ్ల వయసుకు చేరతారని.. అప్పటికి పుంజుకునేలా ఇప్పటి నుంచీ ప్లాన్ చేసుకుంటే చాలని రాహుల్ ప్రణాళికలు వేసుకుంటున్నట్లు తెలుస్తోంది…”
మోదీ హ్యాట్రిక్: నరేంద్ర మోదీ మూడో పర్యాయం అధికారంలోకి రావడం ఖాయం అన్న అంచనాలు అయోధ్య రామాలయ ప్రతిష్ఠతో సర్వత్రా వచ్చేశాయ్. జీఎస్టీ, ధరల పెరుగుదల, నిరుద్యోగంతో దేశంలో బీజేపీపై వ్యతిరేఖత వచ్చింది.. అని భావిస్తున్న తరుణంలో అయోధ్య అంశం తెరపైకి రావడంతో మోడీకి శ్రీరాముడు కూడా తోడయ్యాడు. అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించనుండటంతో ఉత్తర భారతదేశం ‘జై శ్రీరామ్’ నినాదాలతో మార్మోగుతున్నది. విగ్రహ ప్రతిష్ఠ జరగకపోయినా, ప్రత్యేక పూజలు జరగకపోయినా అయోధ్య అక్షింతలంటూ దేశమంతా పంచుతున్నారు. మోదీ ఆచరిస్తున్న ఈ రాజకీయ తంత్రం ముందు ఎవరు మాత్రం నిలబడగలరు? అందుకే కాబోలు 2024 ఎన్నికలను కూడా వదిలేసి 2029 ఎన్నికల్లోనే అదృష్టాన్ని పరీక్షించుకోవాలని రాహుల్ గాంధీ నిర్ణయించుకున్నారు.
చంద్రబాబు సైతం.. ఆంధ్రప్రదేశ్ లో జగన్ అరాచక పాలనతో .. విసిగిపోయిన జనం తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టడానికి రెడీగా ఉన్నారంటూ పలు సర్వేలు చెపుతున్నాయి. అయినా బీజేపీని, మోదీని కాదని ..చంద్రబాబుకు ముందుకు వెళ్లలేని పరిస్థితి. అందుకే బీజేపీ పెద్దలు ఏం చెపితే అది చేయడానికి టీడీపీ అధినేత సిద్ధంగా ఉన్నారు. బీజేపీ తమతో పొత్తుతో వెళ్లాలంటే పొత్తు.. లేదంటే లేదు.. ప్చ్.. అలా చేసుకున్నాడు పాపం చంద్రబాబు..