మాజీ ప్రధాని, దివంగత లాల్ బహదూర్ శాస్త్రి మనవడు విభాకర్ శాస్త్రి కాంగ్రెస్కు రాజీనామా చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి మరో భారీ షాక్ తగిలింది. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆ పార్టీ నుంచి పలువురు బయటకు వెళ్లపోవడం సంచలనంగా మారింది. ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఆయన రాజీనామా పత్రాన్ని అందించారు ఆ విషయాన్నిఎక్స్ ద్వారా వెల్లడించారు.
ఆ తర్వాత విభాకర్ శాస్త్రి ఉత్తర ప్రదేశ్ ఉపముఖ్యమంత్రి బ్రజేశ్ పాఠక్ సమక్షంలో బీజేపీలో చేరారు. తన కోసం బీజేపీ తలుపులు తెరిచినందుకు ప్రధాని నరేంద్ర మోదీ, నడ్డా, అమిత్ షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు కృతజ్ఞతలు తెలిపారు. మహారాష్ట్రలో మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్, బాబా సిద్ధిఖీ తదితరులు ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే..