”ఐదేళ్ల సైకో పాలనలో ప్రశాంతంగా నిద్రపోలేదు. నా ఇంటిపై డ్రోన్లు ఎగరవేయించారు. ఎపుడు ఏం చేస్తాడో తెలియదు. మరోపక్క కేడర్ ని కాపాడుకోవడానికి ఎంతో శ్రమ పడ్డాను. కార్యకర్తల ప్రాణాలు కాపాడటం ప్రధానంగా తీసుకుని సీరియస్ గా చేసాం. కేడర్ కోసం జాగారం చేసిన రాత్రులు ఎన్నో చెప్పలేను..” అని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. ABN ఎండీ వేమూరి రాధాకృష్ణతో జరిగిన బిగ్ డిబేట్ లో చంద్రబాబు పలు అంశాలపై స్పష్టమైన అభిప్రాయం వెల్లడించారు.
జగన్మోహన్ రెడ్డి పాలనలో కొద్దిమంది దుర్మార్గాలకు పాల్పడ్డారని.. తప్పు చేసిన వారిని మళ్ళీ ఆ తప్పు చేయకుండా కఠిన శిక్షలు విధించేలా చేస్తామన్నారు.
”జగన్ సర్కారులో పనిచేసే ఓ అధికారి మారువేషంలో నా దగ్గరకు వచ్చి.. తనను చంపేస్తారని..వణికిపోతూ చెప్పాడు. నేను భరోసా ఇచ్చాను..” ఇలాంటి సంఘటనలు వందల కొలదీ జరిగాయి..
జగన్ సైకో అని నేను చెపుతుంటే.. చాలా మంది నమ్మలేదు.. గతంలో నరసింహారావు అనే సైకాలజిస్ట్ అనేక వ్యాసాలు రాసారని.. ఇపుడు అందరూ అలాగే చెపుతున్నారని.. అయితే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేసారు.
రాజకీయ, అధికార వికృత చేష్టలకు చెక్ చెప్పి సుపరిపాలన తీసుకువస్తామని బాబు పేర్కొన్నారు.
”పట్టాదారు పాస్ పుస్తకంపై ఫోటో పెట్టడం ఏంటీ.. జగన్ అధికారం శాశ్వతమా> రాజముద్రను వేసుకోవాలి. ఈయన ఫొటో వేయడం ఏంటీ? ” అని చంద్రబాబు ప్రశ్నించారు. రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఒరిజినల్ ఇవ్వకుండా జీరాక్ ఇవ్వడమేంటి.. ఇలాంటి దుర్మార్గపు చట్టంపై జనంలో బాగా అవగాహన వచ్చింది… అని చంద్రబాబు వివరించారు.