తెలంగాణ సీఎం రేవంతర్ రెడ్డి ప్రభుత్వం మెగా డీఎస్సీకి నోటిఫికేషన్ సిద్ధం చేసింది. 11,062 ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయనుంది ఆ ప్రభుత్వం. నోటిఫికేషన్ రేపు విడుదలయ్యే అవకాశం ఉందని చెపుతున్నారు. వాస్తవానికి ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల కావాల్సి ఉన్నా సాఫ్ట్ వేర్ రూపకల్పనకు మెరుగులు దిద్దాల్సి రావడంతో ఆలస్యమైంది.
డీఎస్సీపై నిరుద్యోగులు ఎన్నో ఆశల పెట్టుకుని ఉన్నారు. నోటిఫి కేషన్లో 6,500పోస్టులు ఎస్జీటీలే ఉన్నాయి. దాదాపు 4లక్షల మంది ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఉత్తీర్ణులయ్యారు. వాళ్లంతా నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. డీఎస్సీ ప్రక్రియలో ఎలాంటి సమస్య తలెత్తకుండా ఉండేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.