రాజధాని తరలింపు వ్యవహారంతో విశాఖపట్నంలో భూమాఫియా గడ్డలు వాలిపోయాయి. ఎగ్జిక్యూటివ్ కేపిటల్ పేరుతొ మూడేళ్ళ క్రితం సీఎం జగన్ విశాఖను రాజధాని చేయడానికి ప్రయత్నం మొదలయ్యాకా, భూమాఫియా ఆగడాలు మొదలయ్యాయన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
తాజాగా విశాఖ రూరల్ తహసీల్దార్ రమణయ్య హత్యతో భూమాఫియా ఆగడాలు తారాస్థాయికి చేరినట్లయింది. కొందరు నేతలు అధికారులను పావులుగా వాడుకుని ప్రభుత్వ భూములు, వివాదాస్పద భూములను కైవసం చేసుకునే పనిలోపడ్డారు.
”ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్రెడ్డి పాలనలో విశాఖను అరాచక శక్తులకు అడ్డాగా మార్చేశారు. ఇక్కడ అధికార పార్టీ నాయకులే భూదందాలకు పాల్పడుతున్నారు..” 2023 జూన్ నెలలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా విశాఖ సభలో చేసిన వ్యాఖ్యలు ఇవీ.. అంటే అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందొ అర్ధం చేసుకోవచ్చు..
పరిపాలనా రాజధానిగా ప్రకటించిన తర్వాత ముక్యంగా వైసీపీ నేతలు విశాఖ భూములపై వాలిపోయారు.
-రెండేళ్ల క్రితం విశాఖలో కొమ్మాదిలో వంద కోట్ల రూపాయల విలువైన ప్రయివేట్ భూముల్లో అప్పటి విశాఖ గ్రామీణ తహశీల్దార్ నరసింహమూర్తికి అధికార పార్టీ నేతలు నుంచి తీవ్ర ఒత్తిళ్లు వచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి. రెడ్ మార్క్ చేసిన వన్-బి ని మార్చాలని సాక్షాతూ అధికార వైసీపీ ఎమ్మెల్య్ బెదిరింపులకు దిగినట్లు విమర్శలు వచ్చాయి.
- రియల్ ఎస్టేట్ కింగ్ గా పేరొందిన వైసీపీ నేత ఒకరు మధురవాడ బక్కన్న పాలెంలో ఐపీఎస్స్ అధికారి స్థలాన్ని ఆక్రమించి నిర్మాణాలు చేసిన సంఘటన అప్పట్లో సంచలనం రేకెత్తించింది.
- ఇలాంటి సంఘటనలు ఈ నాలుగేళ్లలో అనేకం చోటుచేసుకున్నాయి.
తాజాగా జరిగిన తహసీల్దార్ రమణయ్య హత్య నేపథ్యం కూడా రియల్ మాఫియా వ్యవహారాలేనన్న అనుమానాలు వస్తున్నాయ్.