తిరుమల గౌరవ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులుపై పోలీసు కేసు నమోదైంది. టీటీడీ ప్రతిష్ఠను దిగజార్చేలా వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై టీటీడీ ఐటీ విభాగం జీఎం సందీప్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు తిరుమల వన్ టౌన్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.
ఆయన మాట్లాడినట్టు ఒక వీడియో సోషల్ మీడియాలో రచ్చరేపుతోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో తనది కాదని రమణ దీక్షితులు అంటున్నారు. దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.