తాము పేదలకు మంచి చేస్తుంటే చంద్రబాబు అసూయతో రగిలిపోతున్నాడని ఏపీ సీఎం జగన్ అన్నారు. ఒంగోలులో ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేసి అనంతరం సభలో జగన్ ప్రసంగించారు.పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ చేయనివ్వకుండా 1,191 కేసులు వేయించారని ఆరోపించారు. అమరావతిలో ఇళ్ల స్థలాలపై అసత్య ప్రచారం చేశారు, ఆ కుట్రలన్నీ అధిగమించి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశామని సీఎం జగన్ వెల్లడించారు.
చంద్రబాబు రాజకీయ రాక్షసుడు, వంద మంది సినిమా విలన్ల కంటే దుర్మార్గమే ఎక్కువని విమర్శించారు. 21 వేల మంది లబ్దిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశామని, ఇది దేశంలోనే ఒక చరిత్ర అని అభివర్ణించారు. ఈ జగన్ మీ బిడ్డ. నా వల్ల, మా ప్రభుత్వం వల్ల మీ ఇంట్లో మంచి జరిగితే మీ బిడ్డకు తోడుగా నిలవండి. చంద్రబాబులాగా నేను దళారీలను నమ్ముకోలేదు. మనం సిద్ధం అంటుంటే బాబు అర్ధాంగి సిద్ధంగా లేమని అంటున్నారు.