ఉ దయం 11 గంటల నుంచి మొదలైన కవిత ఈడీ విచారణ
* సాయంత్రం 3 గంటలకు కవితకు లంచ్ బ్రేక్ ఇచ్చిన ఈడీ
* దాదాపు 7 గంటలుగా కవితపై ఈడీ ప్రశ్నల వర్షం
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ ఖాయంగా కనిపిస్తోంది. నేడు ఈడీ విచారిస్తుండటంతో (Kavitha ED Enquiry) తెలుగు రాష్ట్రాలతో పాటు అటు హస్తినలో (Kavitha Delhi) కూడా రాజకీయం వేడెక్కింది. కవితకు మద్దతుగా ఆమె సోదరుడు తెలంగాణ మంత్రి కేటీఆర్, మరో మంత్రి హరీష్ రావు కూడా ఢిల్లీలోనే మకాం వేశారు. ఏడు గంటలకుపైగా సాగిన విచారణలో కవితను లోతుగా ప్రశ్నించిన ఈడీ అధికారులు కవిత సెల్ ఫోన్ ను సీజ్ చేసారు. మరోసారి విచారణకు పిలుస్తామని తెలిపారు.