” ఉమ్మడి ఏపీ చివరి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయాల్లో మళ్ళీ యాక్టివెట్ కాబోతున్నారా? బీజేపీ తీర్థం తీసుకోబోతున్నారా? బీజేపీకి ఏపీలో 2 శాతం కూడా ఓట్లు లేకపోయినా.. ఆ పార్టీ ప్రభావం ఎన్నికలో ఇక్కడ ఏమాత్రం లేకపోయినా.. కేంద్రంలో అధికారంతోపాటు.. రాబోయే ఎన్నికలలోను బీజేపీ దేశ వ్యాప్తంగా అత్యంత కీలకం కానుండటం విశేషం.
హైదరాబాద్ కేంద్రంగా ఆయన ఏపీ, జాతీయ రాజకీయాల్లో మళ్లీ యాక్టివ్గా ఉండబోతున్నారని తెలుస్తోంది. ఆయనకు బీజేపీ.. జాతీయ స్థాయిలో కీలక పదవి ఇచ్చే ఛాన్స్ ఉంది. 2014లో ఏపీ విభజనను వ్యతిరేకిస్తూ… కాంగ్రెస్కి గుడ్ బై చెప్పిన… కిరణ్ కుమార్ రెడ్డి.. ఆ తర్వాత ” జై సమైక్య ఆంధ్ర”పార్టీ స్థాపించారు. ఉండవల్లి అరుణ్ కుమార్ వంటి రాజకీయ మేధావులను కూడా ఆ పార్టీలో చేర్చుకున్నారు. కానీ ఒక్క సీటు కూడా గెలవలేకపోయారు. ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు. తర్వాత మళ్లీ కాంగ్రెస్లో చేరినా… యాక్టివ్గా లేరు. ఇప్పుడు ఆయన బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఆయన హైదరాబాద్లో ఉన్నారు. హైదరాబాద్ లో సీమాంధ్ర ప్రాంత ప్రజలు ఉంటారు కాబట్టి… ఆయనకు వారి నుంచి సపోర్ట్ ఉంటుందనే అభిప్రాయం బీజేపీ వర్గాల్లో బలంగా ఉంది. రాయలసీమలో బీజేపీ వ్యూహాల కోసం కిరణ్ కుమార్ రెడ్డిని ఆహ్వానిస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. తెలంగాణలో ఈ ఏడాదిలో ఎన్నికలు ఉన్న సమయంలో… ఈ రాష్ట్రంపై ఫోకస్ పెట్టడం వల్ల… కిరణ్ కుమార్ రెడ్డిని… హైదరాబాద్ కోసం తీసుకుంటున్నారనే ప్రచారంహైదరాబాద్లో అమిత్ షాతో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యే అవకాశం ఉంది. అనంతరం బీజేపీలో చేరనున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరికపై రాష్ట్రంలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. అయితే కిరణ్ కుమార్ రెడ్డికి పార్టీలో ఏ పదవి ఇస్తారనేది సైతం ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఏపీ బీజేపీ వ్యవహారాలు అప్పగించే అవకాశం ఉందనే టాక్ కూడా నడుస్తోంది. జరుగుతోంది. అయితే కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం బీజేపీలో చేరికపై ఇంకా స్పందించలేదు.