భారత ఆర్థిక వ్యవస్థ కుంటుపడుతోందని ప్రపంచ బ్యాంక్ మాజీ ఆర్థికవేత్త, కార్నెల్ యూనివర్సిటీ ఎకనామిక్స్ ప్రొఫెసర్ కౌశిక్బసు ఆందోళన వ్యక్తం చేసారు. వరల్డ్ బ్యాంక్ గణాంకాలను పరిశీలించి చూస్తే ఈ విషయం స్పష్టమవుతుందని ఆయన పేర్కొన్నారు. . చిన్న దేశాలతో పోలిస్తే పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలోని ఒక శాతం అగ్ర శ్రేణి ప్రాధాన్యతలను గుర్తించడంలో చేసిన పొరపాటుకు ఇది మూల్యం అంటూ పరోక్షంగా కేంద్ర ప్రభుత్వ విధానాలను ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. ఈ తప్పిదాల వల్ల పేద, దిగువ మధ్య తరగతి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టం చేసారు.