ప్రధాని మోదీ లక్ష్యంగా కుట్ర పన్నారు ఇద్దరు తీవ్రవాదులు. నరేంద్రమోదీ హత్యకు పన్నిన కుట్రను బిహార్ పోలీసులు భగ్నం చేశారు. ఈ ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. ” 2047 నాటికి భారత్ను ఇస్లామిక్ దేశంగా మార్చేందుకు ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నట్లు గుర్తించారు.” జూలై 12న మోదీ బిహార్ పర్యటన సందర్భంగా ఆయన్ను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు కుట్రకు ప్లాన్ చేసినట్లు సమాచారం. అరెస్ట్ చేసిన వారిని జార్ఖండ్ రిటైర్డ్ పోలీసు అధికారి మహ్మద్ జల్లావుద్దీన్, అథర్ పర్వేజ్గా పోలీసులు పేర్కొన్నారు. వీరికి పీఎఫ్ఐతో లింకులు ఉన్నట్లు గుర్తించారు. అరెస్టయిన వీరిద్దరూ పాకిస్థాన్, బంగ్లాదేశ్, టర్కీతో సహా పలు ఇస్లామిక్ దేశాల నుంచి దేశంలో ఉంటూ దేశ వ్యతిరేక ప్రచారాలు చేసేందుకు డబ్బును పొందేవారని దర్యాప్తులో తేలింది.
అనుమానిత ఉగ్రవాదులు ప్రధాని పర్యటనకు 15 రోజుల ముందు పుల్వారీ షరీఫ్లో శిక్షణ పొందినట్లు పోలీసులు కనుగొన్నారు. జూలై 6,7 తేదీల్లో మోదీ టార్గెట్గా వ్యూహాత్మక సమావేశాలు నిర్వహించినట్లు గుర్తించారు. పోలీసులు పలు నేరారోపణ డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ‘2047 వరకు ఇండియాను ఇస్లామిక్ ఇండియాగా మార్చాలి’ అని రాసి ఉన్న కీలక డాక్యుమెంట్ ఉంది. వీటితోపాటు 25 పీఎఫ్ఐ కరపత్రాలను స్వాధీనం చేసుకున్నారు. పాట్నాలోని ఫుల్వారీ షరీఫ్ ప్రాంతంలో ఉగ్రవాద కదిలక గురించి ఇంటెలిజెన్స్ బ్యూరోకి వచ్చిన సమాచారంతో పోలీసులు ఈ కేసును ఛేదించారు.