2019 ఎన్నికల ముందు బాబాయ్ వివేకానంద్ రెడ్డి హత్య, విశాఖలో ఎయిర్ పోర్ట్ లో కోడికత్తి డ్రామాలు అప్పటి ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వడానికి ముఖ్య భూమిక పోషించాయి.2024 లోనూ అలాంటి చీఫ్ ట్రిక్స్ మరోమారు మొదలెట్టింది జగన్ అండ్ కో.. అని ప్రతిపక్ష టీడీపీ చేస్తున్న ఆరోపణలలో వాస్తవం ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. గుంటూరు సభలో జగన్ పై జరిగిన దాడి… ఆ సమయంలో విద్యుత్ సరఫరా లేకపోవడం. సాక్షాతూ సీఎంపై దాడికి పాల్పడిన వ్యక్తిని పట్టుకోలేకపోవడ0 ఇవన్నీ అనుమానాలు కాదు.. డ్రామా అనే అంశాన్ని నిర్దారిస్తున్నాయ్. ఈ దఫా ఇలాంటి ట్రిక్స్ కి జనం పడేలా లెరు. ఈ విషయాన్ని జగన్ అండ్ కో గమనించారో లేదో తెలియదు. జనం ఇంకా ఆ వెర్రి తనంతోనే ఉన్నారన్న భ్రమల్లో నుంచి బయటకు రావాలి.