తెలుగుదేశానికి 14 లోక్ సభ సీట్లు
జనసేన, బీజేపీలకు చెరో రెండు
7 సీట్లకే పరిమితంకానున్న వైసీపీ — ‘న్యూస్ఎక్స్’ సర్వేలో వెల్లడి
ఆంధ్రప్రదేశ్లో లోక్సభ ఎన్నికల్లో టీడీపీ కూటమికే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నట్లు ఓ కీలక సర్వ్యే తేల్చింది. ప్రముఖ ఆంగ్ల వార్తా ఛానల్ ‘న్యూస్ఎక్స్’ తాజాగా నిర్వహించిన సర్వేలో టీడీపీ కూటమి బలం కనిపిస్తోంది. . 25 లోక్సభ స్థానాల్లో 14 తెలుగుదేశం పార్టీ చేజిక్కించుకుంటుందని.. దాని మిత్రపక్షాలైన జనసేన, బీజేపీ చెరో రెండు చోట్ల గెలుస్తాయని.. మొత్తంగా 18 సీట్లను ఎన్డీయే చేజిక్కించుకుంటుందని ఆ చానల్ వెల్లడించింది. తాజాగా నిర్వహించిన ‘ఒపీనియన్ పోల్’ ఫలితాలను విడుదల చేసింది. గత ఎన్నికల్లో 22 లోక్సభ సీట్లను గెలుచుకున్న వైసీపీ.. ఈసారి ఏడు స్థానాలను మాత్రమే గెలుచుకుంటుందని అంచనా వేసింది. లోక్సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో బీజేపీ, విపక్షాల పనితీరు ఎలా ఉంటుంది.. ఎన్నెన్ని స్థానాలు గెలుస్తాయో వివరించింది. మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబే సీఎం అవుతారని కూడా వ్యాఖ్యానించింది. ఇటీవల సీఎన్ఎన్-న్యూస్18, ఇండియాటుడే సర్వేల్లో కూడా టీడీపీ కూటమి మెజార్టీ లోక్ సభ సీట్లను గెలుస్తుందని సర్వే లలో వెల్లడించిన సంగతి తెలిసిందే.