‘దేశంలోని ప్రతీ మహిళా నాకు ఓ శక్తి స్వరూపమే. చంద్రయాన్ విజయవంతమైన ప్రాంతానికి శివశక్తి అని నామకరణం చేశాం. అలాంటి శక్తిని వినాశనం చేస్తామని కొంతమంది బయలుదేరారు. ఇప్పుడు శక్తి వినాశకారులకు, శక్తిని పూజించే వారికి మధ్య పోరాటం మొదలైంది. శక్తి ఆశీర్వాదం ఎవరికి ఉందనేది జూన్ 4న తెలుస్తుంది’ అని మోదీ చెప్పారు. శక్తిని ఖతమ్ చేస్తానన్న రాహుల్ గాంధీ ఛాలెంజ్ను తాను స్వీకరిస్తున్నానని, విపక్ష కూటమి నుంచి శక్తిని కాపాడుకుంటానని మోదీ పేర్కొన్నారు.
రాష్ట్రంలోని వివిధ అభివృద్ధి పనులకు వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు మోదీ చెప్పారు. దేశవ్యాప్తంగా బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయే కూటమికి 400 సీట్లకు పైగా వస్తాయని దీమా వ్యక్తం చేశారు. తెలంగాణలోనూ ఆబ్ కీ బార్ 400 కే పార్ నినాదం వినిపిస్తోందని చెప్పారు. ఈ లోక్ సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్, కాంగ్రెస్ పని ఖతమైపోతుందని జోస్యం చెప్పారు. ‘ప్రధాని మోడీ 400 దాటాలి.. బీజేపీకి ఓటు వేయాలి’ అని తెలుగులో చెప్పి బీజేపీ కార్యకర్తలు, సభకు వచ్చిన జనాలను మోదీ ఉత్సాహపరిచారు.