ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో కుంభవృష్టి కురిసింది. మేఘాలకు చిల్లులు పడ్డాయా అన్నట్లు కుండపోత వర్షంకురిసింది. దీంతో జిల్లావ్యాప్తంగా వరదలు ముంచెత్తాయి. తెల్లవారుజామున కురిన భారీవానతో తామస నది ఉప్పొంగి ప్రవహిస్తున్నది. దీంతో జిల్లాలోని ప్రముఖ ఆలయమైన తపకేశ్వర్ మహాదేవ్ ఆలయానికి సంబంధాలు తెగిపోయాయి. ఆలయ పరిసరాలు మొత్తం వరద నీటిలో మునిగిపోయాయి. కాగా, సర్ఖేట్ గ్రామం ఆకస్మిక వరదల్లో చిక్కుకుపోయింది. దీంతో ఎస్టీఆర్ఎఫ్ సిబ్బంది ప్రజలను క్షేమంగా గ్రామంనుంచి బయటకు తీసుకువచ్చారు. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదని ఉత్తరాఖండ్ అధికారి తెలిపారు.