1980 లలో ఆమెను మన పక్కింటి అమ్మాయిలా ఉందనుకునేవారు. ఒకప్పటి స్టార్ హీరోయిన్ సుహాసిని ప్రస్తుతం తల్లి, అక్క, అత్త పాత్రలు పోషిస్తూ బిజీగానే ఉన్నారు. ఇటీవల ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలని తెలిపింది సుహాసిని. 80లలో నటించిన అప్పటి హీరోలు, హీరోయిన్స్ అందరం కలుస్తుంటామని చెప్పిన సుహాసిని ఇంకా ఎన్నో విషయాలు చెప్పారు. ఏటా ఎవరో ఒకరి ఇంట్లో కలిసే వీరు..అప్పుడప్పుడు ఇలా ఎంజాయ్ చేసిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేస్తూ ఉంటారు. ఈ బ్యాచ్ లో చిరంజీవి, వెంకటేష్, నరేష్, సుమన్, నాగార్జున, మోహన్ లాల్, రజినీకాంత్, మమ్ముట్టి, అంబరీష్, జయరాం, సుహాసిని, ఖుష్బూ, రాధిక, రాధా, సుమలత, రేవతి.. ఇలా చాలా మంది సౌత్ యాక్టర్స్ ఉన్నారు. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సుహాసిని ఈ విషయాలన్నీ చెప్పుకొచ్చారు.
” సినీ పరిశ్రమలో నాకు చాలామంది స్నేహితులు ఉన్నారు. రాధా, రాధిక, సుమలత, ఖుష్బూ, రేవతి, లిజీ, రేఖ, పూర్ణిమ.. ఇలా చాలా పెద్ద లిస్ట్ ఉంది. 80లలో కలిసి నటించిన వారంతా నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. మా అందరికి కలిపి ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది. ఇందులో చిరంజీవి, మోహన్లాల్, మమ్ముట్టి, వెంకటేష్, నేను, సుమలత, రాధిక, రాధా.. ఇలా దాదాపు 30 మంది పైనే ఉన్నాం. మేమంతా అప్పటి సంగతులు షేర్ చేసుకుంటూ ఇప్పటి సంగతులు కూడా పంచుకుంటాము” అని సుహాసిని ఆనందంగా చెప్పారు.