ప్రముఖ టాలీవుడ్ నటి మీనా భర్త చనిపోయారు. దీంతో టాలీవుడ్, కోలీవుడ్ లో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె భర్త విద్యాసాగర్ (48). ఆయన అనారోగ్యంతో కొన్ని నెలలుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బెంగళూరుకు చెందిన సాఫ్టువేర్ ఇంజినీర్ అయిన విద్యాసాగర్ను 2009లో మీనా వివాహం చేసుకున్నారు. వారికి ఒక కుమార్తె ఉంది. జనవరిలో మీనా కుటుంబం కరోనా బారినపడింది. ఆ తర్వాత వారు కోలుకున్నప్పటికీ విద్యాసాగర్ మాత్రం లివర్ ఇన్ఫెక్షన్కు గురయ్యారు. అది మరింత తీవ్రమయింది. ఆయనకు లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయాలని వైద్యులు నిర్ణయించినప్పటికీ కుదరలేదు. అంతలోనే ఆయన ఆరోగ్యం విషమించడంతో గత రాత్రి కన్నుమూశారు. విద్యాసాగర్ మరణవార్త తెలిసి తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. విషయం తెలిసిన సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. విద్యాసాగర్ అంత్యక్రియలు నేడు చెన్నైలో జరగనున్నాయి.