- అడ్డంకులన్నీ తొలగిపోయాయన్న ఆర్జీవీ
- ఫిబ్రవరి 23న సినిమా విడుదల
వివాదాల్లో చిక్కున్న ఆర్జీవీ కొత్త చిత్రం ‘వ్యూహం’ విడుదలకు సిద్ధమైంది. ఈ మూవీపై కొంతకాలంగా కోర్టులో వాదాపవాదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. మొత్తానికి నిన్న కోర్టు లైన్ క్లియర్ చేసింది. దీంతో రాంగోపాల్ వర్మ ఈ నెల 23న ఈ చిత్రం విడుదల కాబోతోందని ప్రకటించారు.
ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు. సినిమా విడుదలకు అడ్డంకులన్నీ తొలగిపోయాయని పేర్కొన్నారు. ఒక అమ్మాయితో పార్టీ చేసుకుంటున్న ఫొటోలు, వీడియోలు షేర్ చేశారు.
‘హేయ్ నారా లోకేశ్, చంద్రబాబు, పవన్ కల్యాణ్ వ్యూహం రిలీజ్ ను మేము సెలెబ్రేట్ చేసుకుంటున్నాం. ఫిబ్రవరి 23న సినిమా రిలీజ్ కాబోతోంది అని ట్వీట్ చేశాడు.