ఎంఐటీ అధ్యయనంలో తేలిన వాస్తవాలు
ఉద్యోగాల భర్తీ కష్టం.. మానవ కార్మికులే చవక
ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) అన్నిరంగాల ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్న అంశం. త్వరలోనే ఏఐ అన్నిరంగాల్లో దూసుకొస్తుందని కథనాలు వెలువడుతున్నాయి. దాని ప్రభావంతో చాలా మంది తమ ఉద్యోగాలు, వృత్తులు కోల్పోతారని జోరుగా ప్రచారం సాగుతోంది. ఇప్పటికిప్పుడు అంత ప్రమాదం ఏమీ లేదంటూ అమెరికాలోని మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) తేల్చింది.
కృత్రిమ మేధతో భర్తీ చేయడం దాదాపు అసాధ్యమని, ప్రస్తుత పరిస్థితుల్లో అది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని పేర్కొంది. మానవశ్రమను ఏఐతో భర్తీ చేయడంపై ఆ సంస్థ అధ్యయనం చేసింది. కంపెనీలకు ఆర్థికంగా అనుకూలంగా మారేందుకు దశాబ్దాలు పడుతుందని అంచనా వేసింది.