బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలని హైదర్ గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. ఆటో డ్రైవర్లకు నెలకు రూ.10వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం వల్ల 6.5లక్షల మంది ఆటో కార్మికులు రోడ్డున పడ్డారని వాపోయారు. మరణించిన ఆటో కార్మికుల కుటుంబాలకు రూ.10లక్షల పరిహారం అందించాలని కోరారు.
అనంతరం ప్లకార్డులతో అక్కడి నుంచి అసెంబ్లీకి ఆటోల్లో బయల్దేరారు.అసెంబ్లీలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా బీఆర్ఎస్ నేతలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. నల్ల కండువాలు వేసుకుని వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను భద్రతా సిబ్బంది సభలోకి అనుమతించలేదు. కాసేపు వాగ్వాదం తర్వాత వారిని అనుమతించారు.