- వేషాల కోసం వెంపర్లాడాలి
- అడగడం తనకి అలవాటు లేదన్న జగపతిబాబు
- వారసత్వం ఎంట్రీ వరకే ఉపయోగపడుతుందని వ్యాఖ్య
- లైఫ్ పై ఒక క్లారిటీ వచ్చిందంటూ ఆనందం ఒకప్పుడు హీరోగా మాస్ఒ-క్లాస్ హీరోగా వెలిగిన జగపతిబాబు, ఆ తరువాత విలన్ గానూ అంతే పాప్యులర్ అయ్యారు. అయితే హీరోగా చేసినప్పటికంటే, విలన్ గా అందుకున్న పారితోషికమే ఎక్కువగా ఉండటం విశేషం. అలాంటి జగపతిబాబు ఇటీవల ఓ సందర్బంగా తన గురించిన అనేక విషయాలను వెల్లడించారు.
“అడక్కుండా అమ్మయినా పెట్టదు .. ఇక్కడ అడగాలి .. సందర్భాన్ని క్రియేట్ చేసుకుని మరీ అడగాలి. అలా చేయడం నాకు ఎప్పటికీ చేతకాదు. నన్ను చూడండి .. నేను ఉన్నాను అంటూ ముందుకు రావడం నాకు రాదు. లోపం నాలోనే ఉన్నప్పటికీ ఇప్పుడిక దానిని నేను కరెక్ట్ చేసుకోలేను .. నేను ఇంతే. ఇండస్ట్రీలో ఈ మధ్య నెపోటిజం .. నెపోకిడ్స్ అనే మాటలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయినా తండ్రుల బ్యాక్ గ్రౌండ్ ఎంట్రీ వరకే ఉపయోగపడుతుంది. ఆ తరువాత ఎవరి కష్టం వారు పడాల్సిందే” అన్నారు.
“ఇక్కడున్న ఆర్టిస్టులను పక్కన పెట్టేసి పరభాషా నటులను తీసుకుని వస్తున్నారనే విషయంలో నేను ఎవరినీ తప్పుపట్టను. ఎందుకంటే ఆ పాత్రకి ఎవరు సెట్ అవుతారనిపిస్తే వారినే తీసుకుంటారు. ‘బాహుబలి’లో శివగామి పాత్రను రమ్యకృష్ణనే చేయాలి .. ఆ పాత్రకి మరొకరు సెట్ కారు. నేను సంపాదించింది చాలా కారణాలవలన పోయింది. అందుకు నేను ఎవరినీ బ్లేమ్ చేయడం లేదు. ఆ తరువాత నుంచి మాత్రం రియలైజ్ అయ్యాను .. ఇప్పుడు జీవితంపై నాకు ఒక క్లారిటీ ఉంది” అని ఆయన చెప్పుకొచ్చారు.