”అక్రమ మైనింగ్ వ్యవహారంలో టీడీపీ కార్యకర్తలు పోరాటం చేస్తున్నా.. ఎమ్మెల్యే రాజప్ప వైసీపీ వాళ్లతో చేతులు కలిపి లాలూచీ అయ్యారని టీడీపీ వాళ్లే బాహాటంగా చెపుతుండటం విశేషం. చంద్రబాబు జిల్లా టూర్ సందర్బంగా ఈ లాలూచీ వ్యవహారంపై ఫిర్యాదు ఇస్తామని టీడీపీ యూత్ వింగ్ నేత ఒకరు వెల్లడించారు. ఈ అక్రమ మైనింగ్ వ్యవహారంలో వందల కోట్ల రూపాయలు వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి దోచుకున్నారని కాకినాడ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఇటీవల బాహాటంగా ఆరోపించారు. గ్రీవెన్స్ లో కలెక్టర్ కి కూడా ఫిర్యాదు చేసారు. దీంతో ఈ ఇల్లీగల్ మైనింగ్ ఇష్యూ మరోమారు తెరపైకి వచ్చింది. టీడీపీ స్టేట్ పోరాట కమిటీ కీలక సభ్యుడు , అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి ఈ మైనింగ్ దోపిడీపై పోరాటానికి రెడీ అవుతున్న సందర్భంలో ఇదే జిల్లాకు చెందిన, చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన మాజీ మంత్రి అడ్డుపడినట్లు టీడీపీ నేతలు ఇప్పటికే రాష్ట్ర నేతల దృష్టికి తీసుకువచ్చారు.
”పెద్దాపురం సమీపంలో రామేశం మెట్ట మైనింగ్ దోపిడీపై కాకినాడ టీడీపీ నేత కొండబాబుకి సంబంధం ఏంటి? పెద్దాపురంలో టీడీపీ ఎమ్మెల్యే రాజప్పను మాట్లాడమను ” అని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి విసిరిన సవాల్ పై టీడీపీ నేతలు ఎందుకు మౌనం వహిస్తున్నారు? చంద్రశేఖర్ రెడ్డి పదే పదే చిన రాజప్ప మాట్లాడాలని ప్రెస్ మీట్స్ లో సవాల్ విసురుతున్నా రాజప్ప ఎందుకు నోరు విప్పడంలేదు? వైసీపీ కీలక నేత రామేశం మెట్ట ను చెరువు మాదిరి తయారు చేసారని ఇటీవల ప్రముఖ దినపత్రికలో ఫస్ట్ పేజీ (మెయిన్)లో వేశారు. అయితే ఇందులో మతలబేంటంటే… ఇంత గొడవ జరుగుతున్నా … స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడానికి రాజప్ప ఎందుకు వెనుకంజ వేస్తున్నారు.? ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించినట్లు రాజప్పకు ఈ కొండ అక్రమ మైనింగ్ వ్యవహారంలో సంబంధం ఉందన్న ఆరోపణలకు బలం చేకూర్చినట్లవుతుంది. ”ఇదంతా ఎందుకు.. రాజప్ప గారూ.. ఈ అక్రమ మైనింగ్ వ్యవహారంపై కలెక్టర్ కి, మైనింగ్ అధికారులకు, రెవిన్యూ వారికి ఫిర్యాదు చేయండి. మీ మీద అపవాదు పోగొట్టుకోండి..’ అని ఓ నేత ఇటీవలే ఓ ఉచిత సలహా కూడా ఇచ్చారట. అయితే రాజప్ప దీనికి ఎలా స్పందిస్తారో చూడాలి.