‘అరుదైన కళాఖండాలను మన స్నేహ దేశాల అధినేతలకు గిఫ్ట్ గా ఇచ్చారు ప్రధాని మోదీ. ఆ అపురూపమైన బహుమానాలు అందించిన నరేంద్ర మోదీ కి వారంతా థాంక్స్ చెప్పారు…’
జీ-7 శిఖరాగ్ర సదస్సు కోసం జర్మనీ వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఆ పర్యటనను చిరస్మరణీయంగా మలుచుకున్నారు. ప్రపంచ దేశాధినేతలకు వివిధ రకాల భారతీయ ఉత్పత్తులను కానుకగా అందించారు. భారతదేశ గొప్ప కళలు, చేతి ఉత్పత్తుల నైపుణ్యం ప్రపంచ వేదికపై ఉట్టిపడేలా చేశారు ప్రధాని.
ఉత్తర్ప్రదేశ్లో ‘వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్’ పథకం అమల్లో ఉంది. దీనిని ప్రోత్సహించేందుకు మోదీ జీ-7 శిఖరాగ్ర సదస్సును వేదికగా చేసుకున్నారు. ఒక్కో దేశాధినేతకు ఒక్కో ప్రత్యేకమైన వస్తువును కానుకగా ఇచ్చారు మోదీ.
4/ 16
ఉత్తర్ప్రదేశ్లోని వివిధ జిల్లాల్లో తయారైన వాటికి ఎక్కువగా ప్రచారం కల్పించారు మోదీ. అదే రాష్ట్రంలోని నిజామాబాద్ పట్టణంలో తయారయ్యే కుండలు కూడా మోదీ ఇచ్చిన గిఫ్ట్ల్లో భాగమయ్యాయి.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్కు గులాబీ మీనాకారి అనే ఆభరణం, కఫ్లింక్ సెట్ కానుకగా ఇచ్చారు మోదీ. యూపీ వారణాసిలో వెండితో చేసే వివిధ రకాల ఉత్పత్తులను బనారస్ గులాబీ మీనాకారి పేరుతో మార్కెటింగ్ చేస్తుంటారు. కఫ్లింక్ సెట్ జో బైడెన్ కోసం, మీనాకారి ఆభరణాన్ని అమెరికా ప్రథమ మహిళ, బైడెన్ సతీమణి జిల్ బైడెన్ కోసం ప్రత్యేకంగా చేయించడం విశేషం.
జర్మనీ ఛాన్స్లర్ ఓలాఫ్ షోల్జ్కు నికెల్ లోహం పూతపూసిన.. ప్రత్యేక ఇత్తడి పాత్రలను గిఫ్ట్గా ఇచ్చారు భారత ప్రధాని. ఉత్తర్ప్రదేశ్లో ఇత్తడి నగరంగా పేరొందిన మొరాదాబాద్కు చెందిన ఈ కళాఖండాలను స్వయంగా చేతితో చేస్తారు.
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్కు.. చేతితో ప్లాటినం పూత పూసిన టీ-సెట్ను ఇచ్చారు మోదీ. ఉత్తర్ప్రదేశ్లోని బులంద్శహర్ ఈ టీ-సెట్ తయారీకి ప్రసిద్ధి. బ్రిటన్ రాణి ప్లాటినం జూబ్లీని పురస్కరించుకొని.. ప్లాటినం పెయింట్తో కూడిన పింగాణీ పాత్రలను ప్రత్యేకంగా చేయించారు మోదీ.
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్కు ఉత్తర్ప్రదేశ్ లఖ్నవూలో చేసిన క్యారియర్ బాక్స్ను అందించారు. ఖాదీ సిల్క్, ఫ్రాన్స్ జాతీయ పతాకంలోని మూడు రంగులతో ఉన్న శాటిన్ టిష్యూపై ఎంబ్రాయిడరీ చేశారు. ఈ బాక్స్లో అత్తర్ మిట్టి(అత్తర్), జాస్మిన్ ఆయిల్, అత్తర్ షమామా, అత్తర్ గులాబ్, గరమ్ మసాలా ఉంటాయి.
చేతితో చేసిన పట్టు తివాచీలను(సిల్క్ కార్పెట్) కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడోకు కానుకగా ఇచ్చారు మోదీ. ఇది కశ్మీరీ సిల్క్ కార్పెట్గా ప్రసిద్ధి. మునుపెన్నడూ చూడని హస్తకళా నైపుణ్యం.. ఈ కార్పెట్లలో కనిపిస్తుందని ప్రతీతి.
జపాన్ ప్రధాని ఫుమియో కిషిదాకు.. ఉత్తర్ప్రదేశ్ నిజామాబాద్లో తయారైన నల్ల కుండల విడిభాగాలను అందించారు మోదీ. వీటిని ప్రత్యేకమైన సాంకేతితకతో రూపొందించారు. ఆక్సిజన్ లోపలికి ప్రవేశించని విధంగా ఈ మట్టి పాత్రలను తయారచేస్తారు.
పాలరాయి పొదిగిన టేబుల్ టాప్ను ఇటలీ ప్రధాని మారియో ద్రాగీకి మోదీ గిఫ్ట్గా ఇచ్చారు.
కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, బ్రిటన్, అమెరికాలు ఉన్న జీ-7 నేతలకే కాకుండా.. ఐరోపా సమాఖ్య దేశాలు, ఇండోనేసియా, సౌతాఫ్రికా, సెనెగల్, అర్జెంటీనా దేశాధినేతలకు కూడా మోదీ కానుకలు అందించారు.
రామాయణ ఇతివృత్తంతో కూడిన ధోక్రా కళాఖండాన్ని సౌతాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసాకు ఇచ్చారు. రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు ఏనుగు సవారీ చేస్తున్నట్లుగా ఈ కళాఖండం ఉంటుంది.
అర్జెంటీనా అధ్యక్షుడు ఆల్బర్టో ఫెర్నాండెజ్కు నంది థీమ్తో చేసిన ధోక్రా ఆర్ట్ బహుకరించారు మోదీ. ఇది కూడా ఛత్తీస్గఢ్లోనే తయారవుతుంది. శివుడి వాహనంగా నందిని చెప్పుకుంటారు. దాని ప్రాముఖ్యాన్ని తెలియపర్చేలా ఈ కళాఖండం రూపొందించారు.
సెనెగల్ ప్రెసిడెంట్ మ్యాకీ సాల్కు.. యూపీలోని ప్రయాగ్రాజ్లో ప్రసిద్ధి చెందిన మూంజ్ బుట్టలు, సీతాపుర్కు చెందిన కాటన్ డర్రీని(రగ్గు) గిఫ్ట్గా అందజేశారు భారత ప్రధాని. వీటిని కూడా స్వయంగా చేతులతోనే చేస్తారు.
లక్క పూత పూసిన అలంకార వస్తువు.. రామ్ దర్బార్ను ఇండోనేసియా అధ్యక్షుడు జోకో విడోడోకు అందించారు ప్రధాని మోదీ. ఇది కూడా వారణాసిలో ప్రసిద్ధి చెందింది.
మోదీ ప్రత్యేకంగా ఏరికోరి ఎంపిక చేసి తీసుకువెళ్లి ఇచ్చిన ఆ అపురూపమైన గిఫ్ట్ ఆయా దేశాల నేతలు ఎంతో ఉబ్బి తబ్బిబ్బయ్యారు .