‘అమెరికా కు చెందిన ఒక సంస్థ నిర్వహించిన ఒక సర్వేలో భారత్ ప్రధాని నరేంద్ర మోడీ వరల్డ్ వైడ్ నెంబర్ వన్ పొజిషన్లో నిలిచి.. తన సత్తా చాటుకున్నారు..’
పాలనలో ప్రపంచ దేశాధినేతలు అందరిలో అగ్రస్థానంలో నిలిచారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఆయన పాలనకు 75శాతం మంది ప్రజలు సానుకూలంగా ఓటేశారు. మొత్తం 22 మంది దేశాధినేతల్లో అత్యధిక రేటింగ్ సంపాదించుకున్నారు మోదీ. అమెరికాకు చెందిన ‘మార్నింగ్ కన్సల్ట్ ‘ అనే సంస్థ ఈ సర్వే చేపట్టింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ 41 శాతం అప్రూవల్ రేటింగ్తో 5వ స్థానంలో నిలిచారు.
అమెరికా డేటా ఇంటెలిజెన్స్ సంస్థ ‘మార్నింగ్ కన్సల్ట్’ పలు దేశాలను పాలించే నేతలకున్న ప్రజామోదాన్ని ట్రాక్ చేస్తుంది. ఇంటెలిజెన్స్ విభాగాల ద్వారా ఈ రాజకీయపరమైన సమాచారాన్ని సేకరించి క్రోడీకరిస్తుంది. ఆస్ట్రేలియా, ఆస్ట్రియా, జర్మనీ, బ్రెజిల్, స్పెయిన్, నెదర్లాండ్, దక్షిణ కొరియా, స్వీడన్ వంటి దేశాల్లో ఈ సంస్థ సర్వేను నిర్వహించింది.