అమెరికాలో భారతీయుల పౌరసత్వాలు పెరగడం గర్వంగా చెప్పుకొనే అంశంగా మారింది. గతేడాదిలో అక్కడ అధిక సంఖ్యలో పౌరసత్వాలు పొందిన దేశంగా భారత్ రెండో స్థానంలో నిలిచింది. మొత్తం 59 వేలకుపైగా మంది భారతీయులు అమెరికా పౌరసత్వం పొందినట్టు ఆ దేశ పౌరసత్వ, వలసల సేవా సంస్థ తెలిపింది.
అయితే మొదటి స్థానంలో మెక్సికో ఉంది. భారత్ తర్వాతి స్థానంలో 44, 800 మందితో ఫిలిప్పీన్స్, 35,200తో డొమినికన్ రిపబ్లిక్ ఉన్నాయి. అంతకు ముందు ఏడాదిలో కూడా ఒకటి, రెండో స్థానాల్లో మెక్సికో, భారత్ ఉన్నాయి.