‘తమిళనాడుకు చెందిన వివాదాస్పద .. స్వయంప్రకటిత స్వామి నిత్యానంద అనారోగ్య సమస్యతో కొట్టుమిట్టాడుతున్నారు. భారత దేశానికి రావడానికి ఆయనపై పలు కేసులు ఉన్నాయి. దీంతో శ్రీలంకను ఆశ్రయించారు ఈ వివాదాస్పద గురువు…’
వైద్యం చేయించుకునేందుకు శ్రీలంకలో రాజకీయ ఆశ్రయం కోరుతూ వివాదాస్పద ఆధ్యాత్మికవేత్త, లైంగిక దాడి కేసు నిందితుడు నిత్యానంద ఆ దేశ అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘేకు లేఖ రాశారు. గత నెల 7న రాసిన ఈ లేఖ తాజాగా వెలుగులోకి వచ్చింది. తన ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తున్నదని, తనకు ప్రాణహాని ఉన్నదని.. ఈ నేపథ్యంలో అత్యవసరంగా మెరుగైన వైద్యం పొందేందుకు అవకాశం ఇవ్వాలని అందులో కోరారు. తాను ఏర్పాటు చేసుకున్న శ్రీకైలాశ ద్వీప రాజ్యంలో వైద్య సదుపాయాల కొరత ఉన్నదని నిత్యానంద లేఖలో తెలిపారు. ఈ మేరకు నిత్యానంద లేఖ రాసిన విషయాన్ని శ్రీలంక ప్రభుత్వ వర్గాలు కూడా ధ్రువీకరించాయని ఓ జాతీయ మీడియా సంస్థ వెల్లడించింది.